2021 సంవత్సరానికి ఇజ్రాయేల్ లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో భారత మహిళ హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచింది. 21 ఏళ్ల తర్వాత భారత్ తరుపున మిస్ యూనివర్స్ గా హర్నాజ్ కౌర్ సంధు ఎంపిక కావడం విశేషం. ఇక మిస్ యూనివర్స్ గా ఎంపికైన ఈ సుందరికి ప్రశసంల వెల్లువ కొనసాగుతోంది. మోడలింగ్ లో ఉంటూ తన అంద చందాలు, తెలివి తేటలతో ఆకట్టుకుని మిస్ యూనివర్స్ కి ఎంపిక కావడంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు మారు మోగుతోంది.
సుస్మితా సేన్, లారాదత్తాల తర్వాత ఈ ఘటనతను సాధించిన అందాల తారగా నిలిచింది హర్నాజ్ కౌర్. ఇలా అందాల పోటీలో గెలిచి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకున్న వాళ్లు చాలా మందే అని చెప్పాలి. ఉదాహరణకు ఐశ్వర్యరాయ్, ప్రియాంకా చోప్రా, మనుషి చిల్లర్, సుస్మితా సేన్ వంటి వారు మోడలింగ్ నుంచి వచ్చి ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక ఇదే సమయంలో మిస్ యూనివర్స్ గా ఎంపికైన హర్నాజ్ కౌర్ కు సైతం సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
పంజాబీ చిత్ర పరిశ్రమలోని కొందరు, దర్శకనిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు పోటీ పడుతున్నారట. హర్నాజ్ కౌర్ ఇప్పటికే ‘బాయి జీ కుట్టంగే’ వంటి పంజాబీ మూవీకి సైన్ కూడా చేసిందట. ఈ సినిమాతో పాటు మరో చిత్రం చేయడానికి హర్నాజ్ కౌర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.