సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైన ఒక చిత్రం విడుదల అవుతోంది అంటే చాలు.. ఆ మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంటారు. వారి వారి ఒప్పందాల ప్రకారం ప్రమోషన్స్ లో పాల్గోంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రమోషన్స్ కు రావడం లేదని ఏకంగా విశ్వ సుందరికే లీగల్ నోటిసులు పంపించింది ఓ నిర్మాత. మరి ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హర్నాజ్ సంధు.. పంజాబ్ కు చెందిన మోడల్. అదీ కాక 2021 మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది. 21 ఏళ్లలోనే ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. సంధు ఈ ఘనత సాధించక ముందే సినిమాల్లో నటించింది. ఇప్పుడు అదే ఆమె మీదికి లీగల్ నోటిసులు తెచ్చెలా చేసింది. సంతోష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘బై జీ కుట్టంగే’ అనే సినిమాను పంజాబ్ నటి ఉపాసన నిర్మించారు. ఈ సినిమాలో హర్నాజ్ సంధు ప్రధాన పాత్రలో నటించారు. అయితే మిస్ యూనివర్స్ కాకముందే హర్నాజ్ ఇందులో నటించారు. కానీ ఇప్పుడు ఆమె తన సినిమా ప్రమోషన్లో పాల్గొనడం లేదనేది ఉపాసన ప్రధాన ఆరోపణ.
ఈ విషయంపై ఉపాసన మాట్లాడుతూ.. ‘బై జీ కుట్టంగే’లో హర్నాజ్ సంధు తో పాటు దేవ్ ఖరౌద్ గురుప్రీత్ ఘగీ నటించారు. ఈ సినిమాకు సమీప్ కాంగ్ దర్శకత్వం వహించారు. మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని దక్కించుకున్న తరువాత సంధు తన సంతోష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో ఎల్ఎల్పీతో ఒప్పందం చేసుకున్నరని ఉపాసన తెలిపారు. అయితే ఆ సమయంలోనే సినిమా పూర్తయిన తరువాత ప్రమోషన్ కోసం వ్యక్తిగతంగా, వర్చువల్ గా అందుబాటులో ఉండాలని’ తెలిపానన్నారు.
‘అంతేకాకుండా ఈ సినిమా మే 27న విడుదల కావాల్సి ఉంది. కానీ హర్నాజ్ కోసం ఆగస్టు 19కి వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం డేట్స్ ఇవ్వాలని అడిగితే నిరాకరిస్తుంది. ఇప్పుడు హర్నాజ్ ఆ నిబంధనలు ఉల్లంఘించిందని ఉపాసన ఛండీగడ్ కోర్ట్ లో దావా వేశారు. తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఆమె పిటిషన్ లో కోరారు.
ఈ నేపథ్యంలోనే సంధుకు కోర్ట్ నోటీసులు పంపింది. దీంతో ఈ సంఘటన పంజాబ్ సిని పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తన పై వస్తోన్న ఆరోపణలపై హర్నాజ్ సంధు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈక్రమంలో ఆమె పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి విశ్వ సుందరికి ఇలాంటి నోటిసులు అందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.