Guruswamy: మహర్షి సినిమాలో రైతుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘గురుస్వామి’ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. గురుస్వామి కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో జన్మించారు. చిన్నప్పటినుంచి గురుస్వామికి నటన అంటే ప్రాణం. ఉద్యోగం వచ్చినా నటన మానలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నాటకాలు వేసేవారు. నటనపైన ఉన్న ఆసక్తితో ‘‘విజేత ఆర్ట్స్’’ సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా పలు నాటకాలు వేశారు.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి కంట్లో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మహర్షి’ సినిమాలో రైతు పాత్రకు ఎంపికయ్యారు. మహేష్ బాబుతో కలిసి ఆ సినిమాలో అద్భుతంగా నటించారు. గురుస్వామి మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మరి, మహర్షి సినిమాలో రైతుగా గురుస్వామి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Brahmastra: ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ ట్రెండ్ పై అలియా కామెంట్స్.. అంత లేదంటూ..