నటుడు కృష్ణంరాజుని తెరపై అందరూ రెబల్ స్టార్ అని పిలుస్తారు. తెర వెనక మాత్రం ఆయన మర్యాదరామన్న. నటుడిగా, నిర్మాతగా, తండ్రిగా, పెదనాన్నగా, రాజకీయ నాయకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా ఈయన సినీ కెరీర్ కొనసాగింది. కేవలం హీరోగానే కాకుండా విలన్, సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. వారసత్వంతో వచ్చిన వాటితో పాటు ఇన్నేళ్లలో ఆస్తులు కూడా కాస్తోకూస్తో సంపాదించారని తెలుస్తోంది. తాజాగా ఆయన మరణించడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని సంపన్నుల కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. తల్లిదండ్రుల వారసత్వంగా సొంతూరిలో వందల ఎకరాల భూమి వచ్చిందట. ప్రస్తుతం దాని నిర్వహణంతా కృష్ణంరాజు బంధువులే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఓ భవనంతో పాటు చెన్నై, హైదరాబాద్ లో కృష్ణంరాజుకి నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో కృష్ణంరాజుకి ఫామ్ హౌస్ కూడా ఉందట.
ఇక కృష్ణంరాజు దగ్గర రూ.90 లక్షల విలువైన మెర్సిడెజ్ బెంజ్, రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ.90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. ఇక 2009 లోక్ సభ ఎన్నికల్లో కృష్ణంరాజు అఫిడివిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ.8.62 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. ఇప్పటికి ఆస్తుల విలువ పెరిగి ఉంటుంది. దీనితో పాటు బ్యాంక్ డిపాజిట్లు, కుమార్తెల పేర్ల మీద బాండ్లు ఉన్నాయి. కృష్ణంరాజు కుటుంబం దగ్గర అప్పట్లోనే 4 కిలోల బంగారు ఉందని, ప్రస్తుత మార్కెట్ విలువ దీనికి చాలానే ఉండొచ్చు. పైన చెప్పిన విషయాలన్నీ కూడా మై నేత. ఇన్ఫో వెబ్ సైట్ వెల్లడించింది. ఇవన్నీ చూసుకుంటే.. కృష్ణంరాజు ఆస్తుల విలువ రూ. 200-300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఆస్తులు బానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రెబల్ కృష్ణంరాజు జీవితంలో మీకు తెలియని విశేషాలు!
ఇదీ చదవండి: కృష్ణంరాజుకి రెబల్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే?
ఇదీ చదవండి: కృష్ణంరాజు మరణానికి అసలు కారణం? ఆ సమస్యే కొంపముంచిందా?