ఫస్ట్ ఫస్ట్.. ఈ న్యూస్ చూడగానే మీరు కచ్చితంగా షాకయ్యుంటారు. ఎందుకంటే వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన ‘కేజీఎఫ్’ సినిమాల్లోని హీరోని మార్చేయబోతున్నారా? సీక్వెల్ కోసం కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారా? నిర్మాత మాట్లాడింది చూస్తుంటే.. ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా? అని సగటు నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు. కానీ దీని వెనక కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది?
ఇక విషయానికొస్తే.. హీరో యష్ గురించి పిల్లాడి నుంచి పెద్దోళ్ల వరకు టక్కున గుర్తుపట్టేస్తారు. పేరుకే కన్నడ హీరో అవ్వొచ్చు కానీ ‘కేజీఎఫ్’ సినిమాతో వేరే ఏ హీరోకు సాధ్యం కానీ ఘనత దక్కించుకున్నాడు. పార్ట్ 1,2తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. యష్ అంటే రాకీభాయ్ మాత్రమే అనే రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే సినిమాలో యష్ యాక్టింగ్, ఆహార్యం, రాకీ భాయ్ గా మారిన విధానం అద్భుతమనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే యష్ లేని ‘కేజీఎఫ్’ని ఊహించుకోవడమే చాలా కష్టం. ఇక ఈ రెండు మూవీస్ తర్వాత యష్ వేరే ఏ ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేయలేదు. దీంతో పార్ట్ 3 కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఇక పార్ట్ 2 క్లైమాక్స్ లో మూడో భాగానికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. ఇలాంటి టైంలో నిర్మాత బాంబ్ పేల్చే న్యూస్ చెప్పాడు.
‘కేజీఎఫ్ 3 షూటింగ్ 2025లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాతనే కేజీఎఫ్ 3 ఉంటుంది. అయితే ఈసారి సినిమాలో యష్ ప్లేసులో మరో కొత్త హీరో ఉంటాడు. జేమ్స్ బాండ్ సిరీస్ లోని ప్రతిసారి హీరోలు మారుతున్నట్లు ఇక్కడ కూడా కొత్త హీరోని తీసుకునే ఛాన్స్ ఉంది’ అని తాజాగా ఓ ఇంటర్వ్యలో హోంబలే ఫిల్మ్స్ ఓనర్ విజయ్ కిరగందూర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. యష్ లేని ‘కేజీఎఫ్’ కుదురుతుందా? అలాంటి హీరోని మ్యాచ్ చేసే వాడు దొరుకుతాడా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి యష్-హోంబలే మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా అని సందేహాపడుతున్నారు. మరి ‘కేజీఎఫ్’ నిర్మాత వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
#KGF3 will start shooting only by 2025. pic.twitter.com/lmlyUa4hiU
— LetsCinema (@letscinema) January 9, 2023