Kangana Ranaut: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెంగ్యూ బారిన పడ్డ ఆమె రూములోంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు. వారం రోజుల క్రితం ఆమెకు డెంగ్యూ వచ్చింది. హై ఫీవర్ ఉన్నప్పటికి కంగన సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆమె దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా కోసం షూటింగ్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే, ప్రస్తుతం నడవ లేని స్థితిలో ఆమె రూముకే పరిమితం అయ్యారు. షూటింగ్లు బందు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. సెలైన్ల ద్వారా ఆహారం తీసుకుంటున్నారు.
ఇంత అనారోగ్యంలోనూ ఆమె దేశ భక్తిని చాటారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 ప్రసంగాన్ని వింటూ సమయాన్ని గడిపారు. చేతిలో జాతీయ జెండాతో సోషల్ మీడియాలో దర్శన మిచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఒక చేతిలో తిరంగా జెండా.. మరో చేతికి సెలైన్ పైపు ఉన్నాయి. ‘‘ నేను రూములోంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది.
కానీ, జాతీయ వేడుకలో భాగం కావాలన్న నా కోరిక దాన్ని అధిగమించింది. నా ఇంట్లో స్టాఫ్, నర్సులు, తోటపనివాళ్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉదయం నేను నా గదిలోనే ప్రధాని ప్రసంగం విన్నాను’’ అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మరి, కంగనా రనౌత్కు తీవ్ర అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూడలేదని నా భార్య నన్ను తిట్టింది: పూరీ జగన్నాథ్