సాధారణంగా హీరోలు షూటింగ్ లతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. దాంతో కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం కుదరదు. ఇక చాలా తక్కువ సమయాల్లో మాత్రమే హీరోలకు సమయం చిక్కుతుంది. దాంతో ఆ టైమ్ ను కుటుంబానికి కేటాయిస్తుంటారు. దాంతో తమకు దొరికిన తక్కువ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకు వెళ్తుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతానికి షూటింగ్ లు ఏమీ లేకపోవడంతో కుటుంబంతో కలిసి యూఎస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ భార్య లక్ష్మీ ప్రణతితో దిగిన ఓ రొమాంటిక్ ఫొటోను తన ఇన్ స్టాలో షేర్ చేశాడు యంగ్ టైగర్. ఆ పిక్ కు లవ్ సింబల్స్ ను యాడ్ చేసి మరింత రొమాంటిక్ క్రియేట్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం RRRతో అఖండమైన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా యూఎస్ టూర్ లో ఉన్న ఎన్టీఆర్ అక్కడి ప్రదేశాల్లో దిగిన ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. తాజాగా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమతో ముద్దు పెడుతున్న పిక్ ను షేర్ చేశారు యంగ్ టైగర్. మియామీ బీచ్ హోటల్ లో దిగిన ఈ పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నట్లు అధికారికి ప్రకటన వచ్చింది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ తో ఓ మూవీని చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వెకేషన్ ను ఎంజయ్ చేస్తున్నాడు.