మీలో ఎవరు కోటీశ్వరుడు.. యన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఇప్పుడు ఈ షో వేదికగా ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలుచుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును.. నిజమే..ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ఈ అద్భుతం జరిగింది. అయితే.. ఈ కోటి గెల్చుకున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు అంతా అతని డీటైల్స్ కోసమే గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న విజేత పేరు రాజా రవీంద్ర అని తెలుస్తుంది. ఇతను తెలంగాణా రాష్ట్రంలోని కొత్తగూడెంకి చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అట. అంతేకాదు గన్ షూటింగ్ లో ఇతను నేషనల్ లెవెల్ ప్లేయర్ గా తెలుస్తోంది.
ఒలంపిక్స్ లో ఎయిర్ రిఫిల్ విభాగంలో పాల్గొని గెలవాలన్నది రాజా రవీంద్ర లక్ష్యం. దాని కోసమే తన ప్రైజ్ మనీని ఉపయోగిస్తాడట రాజా రవీంద్ర. ఈ ఉన్నతమైన లక్ష్యానికి తాను కూడా అండగా నిలుస్తానని తారక్ అతనికి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి.. సామాన్యుడిని కోటీశ్వరుడిన్ని చేసిన.. తారక్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.