నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘‘ అన్స్టాపబుల్’’. ప్రముఖ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోకు మంచి పాపులారిటీ వచ్చింది. బాలయ్య తన దైన శైలి యాంకరింగ్తో షోను ముందుకు తీసుకెళుతున్నారు. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తయి రెండో సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. సీజన్లో హేమాహేమీలు, రాజకీయ ఉద్ధండులు గెస్ట్లుగా వచ్చారు. తాజా ఎసిసోడ్కు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో గోపీచంద్ గెస్ట్లుగా వచ్చారు.
ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక, తర్వాతి ఎపిసోడ్కు సీనియర్ నటీమణులు జయప్రద, జయ సుధతో పాటు హీరోయిన్ రాశీ ఖన్నా గెస్ట్లుగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సదరు ఓటీటీ సంస్థ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘ అందం అభినయం కలగలిపిన సహజనటి జయసుధ గారు. మల్టీ టాలెంటెడ్ జయప్రద గారు. రివైజింగ్ రాశీఖన్నా.. ప్రతిభ కలిగిన , అందమైన ఈ నటీమణులు బాలకృష్ణతో చేసిన సందడిని క్యాచ్ చేయండి. కేవలం అన్స్టాపబుల్ షోలో మాత్రమే’’ అని పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, అన్స్టాపబుల్ ముగింపు ఎపిసోడ్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అఫియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్తో పాటు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పాల్గొననున్నారట. ఈ ఎపిసోడ్ కోసం ఇటు పవన్ ఫ్యాన్స్తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి, జయప్రద, జయసుధ, రాశీ ఖన్నాల ఎపిసోడ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Andham abhinayam kalagalipina Sahajanati Jayasudha garu, Multitalented Jayaprada garu and ravishing Rashi Khanna.
Catch the most talented and beautiful actresses being candid with NBK. Only on #UnstoppableWithNBKS2 #NBKOnAHA #Jayasudha @realjayaprada #RaashiKhanna pic.twitter.com/I5f8dWYGLC— ahavideoin (@ahavideoIN) December 19, 2022