జీవిత - రాజశేఖర్ దంపతులు 2011లో మెగాస్టార్ చిరంజీవికి చెందిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పరువు నష్టం కేసులో జీవిత – రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (జూలై 18) నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ACMM) ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. ఈ వార్త ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారడమే కాక.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జీవిత – రాజశేఖర్ దంపతులు 2011లో మెగాస్టార్ చిరంజీవికి చెందిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ వారిపై పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో పాటు అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం మంజూరు చేసింది. అప్పట్లో రాజశేఖర్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి బ్లడ్ బ్యాంకు మీద ఆరోపణలు చేశారు.
అవి అసత్య ఆరోపణలని సవాల్ చేస్తూ 2011లో అల్లు అరవింద్ వారి వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపి సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు రాజశేఖర్ దంపతులకు రెండేళ్ల (ఏడాది అని కూడా సమాచారం) జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్పై కోర్టు నుంచి విడుదలయ్యారు.