‘కేజీయఫ్ ఛాప్టర్1’తో ప్యాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన హీరో రాకింగ్ స్టార్ యశ్. ఈ దండయాత్రను కంటిన్యూ చేయడానికి ఆల్రెడీ రెండో పార్ట్ను తీస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ పై .. చాప్టర్ 1 కంటే కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ కోసం కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుండగానే యష్ నెక్ట్స ప్రాజెక్ట్ ఏంటనే ప్రశ్న మొదలైంది.
రాఖీ బాయ్ నెక్స్ట్ మూవీ ‘ముఫ్తీ’ మూవీ ఫేమ్ నర్తన్ డైరెక్షన్ లో ఉంటుందని తెలుస్తోంది. మొన్నటివరకు యష్ తదుపరి సినిమా బాలీవుడ్ డైరెక్టర్ తో.. టాలీవుడ్ డైరెక్టర్ తో అంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఇటీవల దర్శకుడు అందించిన సమాచారం ప్రకారం.. యష్ తదుపరి చిత్రం కోసం నర్తన్ ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభంచినట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది.
నర్తన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో యష్ నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు పాత్రకు తగ్గట్లుగా యష్ ని కొత్త లుక్ లో ఎంతో స్టైలిష్ గా ప్రెజంట్ చేయాలని మేకర్లు భావిస్తున్నారట. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కన్నడ సినీవర్గాల ప్రకారం.. ఈ సినిమాకు జటస్య అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. చూడాలి ఆఫీషియల్ కన్ఫర్మేషన్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో. మరి రాఖీ భాయ్ గా ఇండస్ట్రీ రికార్డ్స్ దుమ్ము దులిపిన యష్ నేవీ ఆఫీసర్ గా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.