తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డెైరెక్టర్ గా చేశాడు. తన తొలి చిత్రం ‘గులాబీ’తోనే పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మరి ఆ విశేషాల గురించి తెలుసుకుందాం పదండి.
కృష్ణవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికరమైన సంఘటనల గురించి వెల్లడించాడు. దానినిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన బహుమతి వల్లే గతంలో తాను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్లు తెలిపారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ..”నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. ఆయన తన తోటి వారందరినీ గౌరవిస్తారు. ఇప్పటికి ఆయన అలానే ఉన్నారు. అందుకే ఆయనంటే నాకు గౌరవం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ‘గోవిందుడు అందరివాడేలే’ కు ఛాన్స్ ఇచ్చారు.
ఆయనతో కలిసి గతంలో ఓ యాడ్ లో కూడా పనిచేశా. దాని డబ్బింగ్ సమయంలో.. ”అన్నయ్య.. మీకు బాగా ఇష్టమైన వ్యక్తికి ఈ కారు గిఫ్ట్ గా ఇచ్చేస్తారా?” అని చిరుని సరదాగా అడగ్గా.. ‘కావాలా?’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచి మరీ.. ‘ఈ కారు నీకే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నా.. అన్నయ్యా అని పిలుస్తున్నావ్. మరి ఈ అన్నయ్య ఇస్తే తీసుకోవా?’ అని అడిగారు. అలా వచ్చిన కారుతో ఎన్నో సాహసాలు చేశా. ఓ సారి నందిగామ వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అంత పెద్ద ప్రమాదంలోనూ నాకూ, డ్రైవర్ కు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రాణాలతో బయటపడ్డానంటే ఆ కారు వల్లే’ అని కృష్ణవంశీ చెప్పారు.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. దీనికి మెగాస్టార్ వాయిస్ ఓవర్ అందించారు. ఇక తన వైవాహిక జీవితంపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. మరి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పంచుకున్న అంశాలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.