సినిమా హీరోహీరోయిన్లుని చూడగానే.. వాళ్లకేంటి భలే హ్యాపీగా ఉన్నారు కదా మీరు అనుకోవచ్చు. కానీ రియాలిటీలో అలా ఉండదు. ఎందుకంటే కెరీర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాటిని ఎప్పుడూ బయటపెట్టారు కాబట్టి మనకు వాటి గురించి పెద్దగా తెలీదు. సందర్భం వచ్చినప్పుడు చెబితే మాత్రం అయ్యో, అవునా అలా జరిగిందా అని ఫీలవుతాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. తెలుగులో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఓ భామని పలువురు అనరాని మాటలు అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెబుతూ తన బాధని రివీల్ చేసింది. ఇది విన్న పలువురు నెటిజన్స్.. ఇండస్ట్రీపై మరోసారి విరుచుకుపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మరాఠీ బ్యూటీ సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రేయ్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మన దగ్గర కంటే హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. రీసెంట్ టైంలో తెలుగులో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ , ఆనంద్ దేవరకొండ ‘హైవే’ సినిమాల్లో నటించింది. ఇక తాజాగా ఆమె నటించిన ‘ఫాదూ’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘నటిగా తన కెరీర్ ప్రారంభంలో లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలని వెటకారంగా మాట్లాడేవారు. కానీ నేను వాటిని పట్టించుకునే దాన్ని కాదు. ఎవరైనా సరే నా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. కాస్త మందంగా ఉండటం వల్ల అలాంటి వ్యాఖ్యలకు బాధపడలేదు. కానీ అలాంటి చీప్ కామెంట్స్ చేయడం మాత్రం చాలా విచారకరం. ఎవరైనా సరే ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవతలి వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది’ అని సయామీ ఖేర్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.