సెలబ్రిటీలని అందరూ గమనిస్తుంటారు. మనలాంటి నార్మల్ మనుషుల గురించి ఎవరూ పట్టించుకోరు కానీ స్టార్ హీరో లేదా హీరోయిన్ల గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్లు ఎక్కడైనా బయట కనిపించడం లేటు.. సెల్ఫీల కోసం ఎగబడతారు. కొన్నిసార్లు ఇవే కాకుండా.. సదరు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అప్పుడు వాళ్లు సోషల్ మీడియాలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ అమలాపాల్ కు కూడా అదే జరిగింది. దీంతో ఇలా ఎలా చేస్తారంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ఇక విషయానికొస్తే.. హీరోయిన్ అమలాపాల్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, బెజవాడ లాంటి మూవీస్ చేసింది. ‘కుడి ఎడమైతే’, ‘పిట్ట కథలు’ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ లీడ్ రోల్స్ చేసింది. అయితే తెలుగులో ఈమెకు అనుకున్నంత ఫేమ్ దక్కలేదు. అయితేనేం తమిళం, మలయాళంలో మాత్రం వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగానే ఉంటుంది. రీసెంట్ గానే ‘ద టీచర్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఈమె.. కేరళలోని ఎర్నాకులంలో చేదు అనుభవం ఎదురైంది.
కేరళ ఎర్నాకులంలోని తిరువైరాణికుళం మహాదేవ ఆలయం దర్శనం కోసం అమలాపాల్ సిద్ధమైంది. అయితే గుడి అధికారులు మాత్రం ఆమెని బయటే అడ్డుకున్నారు. ఈమె క్రిస్టియన్ అయినందువల్ల లోపలికి ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. కేరళలోని చాలా ఆలయాల్లోకి హిందువులు మాత్రమే అనుమతి ఉండటం వల్ల అధికారులు అమలాపాల్ విషయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. అమ్మవారి దర్శనం జరగనప్పటికీ.. తాను ఎంతో సంతృప్తితో తిరిగి వెళ్తన్నట్లు తన అనుభవాన్ని పంచుకుంది. 2023లో కూడా ఈ మత వివక్ష ఏంటని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ ఇష్యూపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.