తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు హీరో విశాల్. తాజాగా ఓ వివాద విషయంలో విశాల్ కి హై కోర్టులో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్కు కోర్టు మూడు వారాల గడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
అసలు విషయంలోకి వెళ్తే.. లైకా సంస్థతో విశాల్ గతంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 15 కోట్లు చెల్లించకుండా విశాల్ తన కొత్త సినిమా వీరమే వాగై సుడేమ్ రిలీజ్ చేయకుడదు. విశాల్ అప్పు ఇచ్చిన డబ్బులు చెల్లించకుండానే ఆ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాడని, అంతే కాకుండా తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్లను రుణాన్ని రికవరీ చేయించాలని లైక ప్రొడక్షన్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ పై విచారణ చెపట్టిన జస్టిస్ సెథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డీ కరెకర్ట్ కాదని విశాల్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.