తారకరత్న, అలేఖ్యారెడ్డిల కూతురు నిషిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తారకరత్న మరణించిన సమయంలో నిషిక కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలించాయి. తాజాగా ఆమె రాసిన ఓ పోస్ట్ మరోసారి కన్నీరు పెట్టిస్తుంది.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నందమూరి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, వారి పిల్లలను ఓదార్చం ఎవరి తరం కాలేదు. ఇక తారకరత్న కుమార్తె నిషిక కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలించాయి. అలానే ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా నిషిక రాసిన ఎమోషనల్ నోట్ నెటింట్లో వైరల్ అవుతోంది. భర్త మృతి చెందిన బాధ నుంచి కోలుకోలేక అలేఖ్యారెడ్డి ఇప్పటికీ మానసిక వేదనకు గురైవుతున్నారు. దీంతో తల్లి బాధను చూడలేక నిషిక ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
జనవరి 27న గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరిన తారకరత్న.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. ఆఖరకు ఫిబ్రవరి18న కన్ను మూశారు. ఆయన మరణంతో అటు నందమూరి కుటుంబంలోనే కాక.. టీడీపీలో, సినీ ఇండిస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక తారకరత్న మృతి ప్రతి ఒక్కరిని కదిలించింది. మరీ ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రాణంగా ప్రేమించిన భర్త మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న అంతిమ సంస్కారాలు, చిన్న కర్మలో అలేఖ్యారెడ్డిని చూసిన వారెవరికైనా.. గుండె బరువెక్కక మానదు. అంతులేని విషాదానికి నిలువెత్తు రూపంలా ఉన్నారు అలేఖ్యారెడ్డి.
నెలలు గడుస్తున్న భర్త చనిపోయిన బాధ నుంచి అలేఖ్యరెడ్డి కోలుకోలేక ఇప్పటికీ తీవ్ర మానసిక వేదన గురవుతున్నారు. ఆమె బాధను చూడలేకనే కుమార్తె నిషిక ఓ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. “అమ్మ.. నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెబుతా” అని పోస్టులో నిషిక చెప్పుకొచ్చారు. ఇంత చిన్న వయస్సులోనే నిషిక తల్లిపై ప్రేమను వ్యక్తపరచటంతో పాటు ఆమె పరిస్థితిని చూసి చలించిందని, తల్లి ఏడిస్తే నిషిక అస్సలు తట్టుకోలేకపోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిషిక రాసిన నోట్ ను తారకరత్న సతీమణి అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. నిషిక భావాలను అర్థం చేసుకున్న నెటిజన్లు అలేఖ్య బాధను చూసి నిషిక కుమార్తె బాధ పడుతోందని, పిల్లలను బాధ పెట్టుకుండా అలేఖ్య అడుగులు వేయాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అలేఖ్య రెడ్డి బాధలను తట్టుకుంటూ భవిష్యత్తులో పిల్లల కోసం ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.