తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ. బాయ్స్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించాడు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటాడు సిద్దార్థ. అంతే కాదు పలు విషయాల్లో తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా ఇండియా సినిమా వసూళ్లపై నటుడు సిద్ధార్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘సినీ ప్రొడ్యూసర్లు కొన్నాళ్లుగా బాక్సాఫీసు లెక్కల విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు, మీడియా అదే దారిలో పయనిస్తున్నాయి. తప్పుడు లెక్కల్ని అధికారికంగా ప్రకటిస్తున్నాయి. అన్ని చలన చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిజాయతీలేని పాన్ ఇండియా. ఇలాంటి అసత్యపు రిపోర్ట్లు ఇవ్వడానికి కమిషన్ ఎంత తీసుకుంటున్నారు?’ అని ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. ఎంత ఇష్టమైన సినిమాను అయినా పదేపదే చూసే అలవాటు తనకు లేదన్నాడు.
ఇదీ చదవండి : సీఎం జగన్ పై నటుడు బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్!
దర్శకులు కొత్త కథల్ని తెరకెక్కించాలని కోరాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన ఈ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఆట’, ‘ఓయ్’, ‘బొమ్మరిల్లు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సిద్ధార్థ్. కొన్నాళ్ల విరామం అనంతరం ‘మహాసముద్రం’ సినిమాతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
How much is the going commission or rate these days for fudging collection reports of films?
Producers have been lying about BO figures for ages… Now the “trade” and “media” have started their “official” figures… All languages, all industries…same.
Pan India dishonesty🤦🏾
— Siddharth (@Actor_Siddharth) December 22, 2021