సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కేవలం సినిమాలు, షోలపై మాత్రమే ఆధారపడకుండా.. వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. స్టార్ హీరోలు మొదలు చిన్న చిన్న సెలబ్రిటీల వరకు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ జాబితాలో నటి హేమ చేరింది. ఆమె స్టార్ట్ చేసిన కొత్త వ్యాపారం ఏంటంటే..
ఈమధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు.. సినిమాలు, బుల్లితెర, షోలు వంటి వాటితో పాటు.. అదనపు ఆదాయం కోసం వేర్వేరు వ్యాపారాలు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలు చేసిన కిర్రాక్ ఆర్పీ క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం ప్రారంభించాడు. ఆర్పీ ప్రారంభించిన చేపల పులుసు బిజినెస్ బాగా క్లిక్ అయ్యింది. తాజాగా మణికొండలో మరో బ్రాంచ్ ఒపెన్ చేశాడు ఆర్పీ. తాజాగా ఆర్పీలా బిజినెస్ ప్రారంభించిన సెలబ్రిటీల జాబితాలో నటి హేమ చేరింది. ఆమె కూడా కొత్త వ్యాపారం ప్రారంభించిందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు..
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ. దశాబ్దాలుగా ఆమె తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి హేమ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఇక తాజాగా ఆర్పీ మణికొండలో ప్రారంభించిన చేపల పులుసు ఔట్లెట్ ఒపెనింగ్కి హేమ కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా కొందరు ఆమెను ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు ఏంటి మేడం అని ప్రశ్నించారు. అందుకు హేమ.. నేను కూడా కొత్త బిజినెస్ ప్రారంభించాను. దానిలో సంపాదన ఎక్కువయ్యి.. సుఖ పడటం అలవాటు అయిపోయింది.. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ సెటైరికల్గా సమాధానం ఇచ్చింది.
దాంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అంతలా ఆదాయం వచ్చే బిజినెస్ ఏంటబ్బా అని ఆలోచించసాగారు. అంతేకాక ఏం వ్యాపారం మేడం అని హేమను ప్రశ్నించారు. అందుకు ఆమె మరో ఇంటర్వ్యూలో చెబుతానంటూ సమాధానం దాటవేసింది. ఇక కిర్రాక్ ఆర్పీ మంచి కోరేవారిలో తాను ముందు వరుసలో ఉంటానని చెప్పుకొచ్చింది హేమ. అంతేకాక అందరూ బావుండాలి.. అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతాను అన్నది. కానీ హేమ మాటలు విన్న వారికి ఆమె వెటకారంగా అన్నదా.. లేక నిజంగానే ఏమైనా వ్యాపారం ప్రారంభించిందా అని చర్చించుకుంటున్నారు. మరి హేమ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.