పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా అప్ డేట్ లకోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో ప్రభాస్- అనుష్క జంటకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబోలో వచ్చిన బిల్లా, మిర్చి, బాహూబలి సిరీస్ చిత్రాలు ఎన్ని రికార్డ్లు బద్దలు కొట్టాయో స్పెషల్గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఈ జోడికి అభిమానులు ఉన్నారు. రియల్ లైఫ్లోనూ వీదిద్దరు మంచి స్నేహితులు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్కు చేరుకున్నాడు. ఇక అనుష్క విషయానికి వస్తే జీరో సైజ్ చిత్రం చేసి అవకాశాలు తగ్గేలా చేసుకుంది. ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తోంది బొమ్మాళి. చిన్న చిత్రాలు చేయడం వల్ల కెరీర్కు పుల్స్టాప్ పడుతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోక అదిరిపోయే వార్త ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనుష్క మాత్రం వేగాన్ని తగ్గించారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందని సినీ వర్గాల్లో గట్టిగానే చర్చ జరగుతుది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట. జేజమ్మ ఫ్యాన్స్కి మాత్రం చేదు వార్త అని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్తో తను తీసే మూవీలో నటించాలని అడిగారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా ఒక ముఖ్య పాత్రలో తీసుకుంటారట. అందుకు అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమచారం. కానీ అధికారికంగా ఇంక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ – అనుష్క కాంబోలో మరో పిరియాడికల్ తీసేందుకు డైరెక్టర్ క్రిష్ ఓ కథను రెడీ చేశారట. బాహుబలి నిర్మాతలకు ఆయన కథను కూడా వినిపించారట. ఈ ప్రాజెక్ట్ను నిర్మించడానికి వారు ముందుకొచ్చినట్టుగా సినీ వర్గాల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మరోసారి బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ – అనుష్కను చూడోచ్చు ఇది వారి ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్లో అనుష్క చేసిన లేడీ ఓరియంటెడ్ ఫిలిం ‘భాగమతి’ సూపర్ హిట్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత అదే నిర్మాణ సంస్థలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో నటిస్తోంది. నవీన్ స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా కనిపించనున్న ఈ మూవీని ఆగస్టు 4న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. కట్ చేస్తే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవుతున్నందున అభిమానులకు క్షమాపణలు చెప్తూ ఓ లెటర్ షేర్ చేశారు మేకర్స్.