వికర్టీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం F3. యంగ్ డైరెక్ట్ అనిల్ రావిపూడి చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటించారు. F2 చిత్రాన్నికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. తాజాగా F3 మూవీ కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. “ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటుంది. అదే డబ్బు” అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ అవుతుంది.’డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా’..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి.
“వాళ్లది మాయల మరాఠి ఫ్యామిలీ అంటే మాది దగ్గుబాటి ఫ్యామిలీ” అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. “వాళ్లది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ” అంటూ వరణ్ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. వెంకటేష్, వరణ్ తేజ్ ఓ రేంజ్ లో కామెడీ పండిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన “ఎఫ్-2” ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సారి డబుల్ ఎంటర్టైనమెంట్తో F3 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. F3 ట్రైలర్ పై మీరు ఓ లుక్కేసి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.