ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. తక్కువ పెట్టుబడితో వస్తున్న సినిమాలు కంటెంట్ నచ్చడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేస్తున్నాయి.
ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలైన ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. కొత్త నటీనటులు, దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో ‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న సినిమా ‘పేక మేడలు’. 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేశ్ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’మంచి విజయం సాధించింది. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన ‘పేక మేడలు’ మూవీ టీజర్ రిలీజ్ కి హీరో విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరోహీరోయిన్ గా నటిస్తున్న ‘పేక మేడలు’ మూవీ టీజర్ ని ప్రముఖ నటుడు విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నటుడిగా తన సత్తా చాటిన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది.. సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించాడు. ఈ మూవీలో హీరో వినోద్ చాలా అద్భుతంగా నటించినట్లు అతని కళ్లలో కనిపిస్తుంది. పోస్టర్స్, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఈ మూవీకి మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నా.. రాకేష్ కి నా బెస్ట్ విషెస్. ఇక నా రెండు సినిమా గురించి వారంలో అప్ డేట్ ఇస్తాను. అంతేకాదు వాటితో పాటు ఒక సర్ప్రైజ్ కూడా ఇస్తాను. ఈ సందర్బంగా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. చిన్నా, పెద్ద హీరోలు ఎవరి లైఫ్ వారిది.. ఏదో ఒక బిజీ షెడ్యూల్ లో ఉంటారు. ఆ సమయంలో కథలు వినలేము.. టైమ్ ఇవ్వలేం. గంట సేపు ఓ మనిషి టైమ్ తీసుకొని తిరస్కరిస్తే అతను ఎంత బాధపడతాడో నాకు తెలుసు.. అందుకే నా నోటి నుంచి వచ్చిన జవాబు మాత్రమే. ఆ సినిమా ట్రైలర్ చూసి మెచ్చుకుంది ఫస్ట్ నేనే.. ’ ఆ మూవీ నేను చేయాల్సింది.. సెట్ కాలేదు. మన సినిమా బాగుంటే గొప్పగొ చెప్పుకోవడం మంచిదే.. కానీ అవత వారిని కించపరచడం పద్దతి కాదు.. ఆ విషయం నాకు చాలా బాధ అనిపించింది అన్నారు విశ్వక్ సేన్.
నిర్మాత రాకేష్ మాట్లాడుతూ.. ‘నటుడిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు నిర్మాతగా మీ ముందు ఉన్నాను. మొదటి సినిమా నాకు కొన్ని ఇబ్బందులు కలిగినా.. ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ సహాయం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా మొదటి మూవీ 3 రోజులు అడుతుందని అనుకుంటే.. 30 రోజులు నడిచింది. పేక మేడలు చాలా బాగా వచ్చింది.. హైదరాబాద్ లో ఓ బస్తీలో నేపథ్యంలో సాగే కథ. నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టాను. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్ ని ఎందుకు గెస్ట్ గా పిలిచానంటే.. అతని కమిట్మెంట్ నాకు ఇష్టం. ఇండస్ట్రీలో కెరీర్ బిగినింగ్ లో ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ.. వాటన్నీంటిని దాటుకొని ‘ఫలక్నుమా దాస్’ చిత్రంతో తనని తానే స్టార్ చేసుకున్నాడు. విష్వక్గా డెడికేషన్ ని నేను ఫాలో అయ్యాను.. ఈ మూవీ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందని నమ్మకం ఉంది.
దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాను.. నా గురువుగారు దీక్షితులు. యాక్టీంగ్ స్కూల్ లో ఉన్నపుడు దర్శకత్వంపై బాగా మక్కువ పెంచుకున్నాను. అనీస్ కురువిల్లా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఈ సినిమా బస్తీ నేపథ్యంలో చాలా నేచురుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే కథాంశంతో రూపొందించాం. మంచి టీమ్ కుదిరింది.. రాకేష్ లాంటి నిర్మాత బాగా సహకరించారు. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.. నేను గట్టిగా నమ్ముతున్నాను’ అని అన్నారు.