రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివితీరదు అంటారు. రామాయణం పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.. కానీ అవి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆదిపురుష్ మూవీ గురించి టాక్ నడుస్తుంది. ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ పేరే వినిపిస్తుంది. ఓం రౌనత్ దర్శకత్వంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రతి ఒక్క పాత్రను దర్శకుడు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రామాయణంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకటి శూర్పణఖ. ఆదిపురుష్ మూవీలో శూర్ఫణఖ గా నటించింది తేజస్విని పండిట్. ఇంతకీ తేజస్విని పండిట్ ఎవో మీకు తెలుసా? ఆమె గురించి పూర్తి వివరాలు మీ కోసం.
రామాయణంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకటి రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. వనవాసంలో ఉన్న రాముడిని ఇష్టపడి తన మనసులోని కోరిక చెబుతుంది. ఆ సమయంలో రాముడి సోదరుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరిస్తాడు. ఈ పాత్రను ఆదిపురుష్ మూవీలో చూపించారు. ఇక శూర్పణఖ పాత్రలో నటించింది తేజస్విని పండిట్. ఆదిపురుష్ మూవీ ఎంతో క్రూరంగా కనిపించిన తేజస్విని పండిట్ రియల్ లైఫ్ లో స్టార్ హీరోయిన్. మరాఠా చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడు పాపులర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004 లో వచ్చిన మారాఠి చిత్రం ‘అగా బాయి అరేచా’ మూవీతో కెరీర్ ఆరంభించింది. అయితే మొదటి చిత్రంలోనే నెగిటీవ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
తేజస్విని పండిట్ కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది. తేజస్విని తన వ్యక్తిగత జీవితంలో చాలా గ్లామరస్ గా ఉంటుంది.. ఎక్కువ స్వేచ్చా జీవితం గడపడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల తేజస్విని పండిట్ వరుసగా వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉటుంది.. ప్రతిరోజూ తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది.