తెలుగు సినిమా పరిశ్రమలో లవ్ కంటెంట్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు. బేబి కూడా అదే కోవలోకి వచ్చి చేరింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్.
తెలుగు సినిమా పరిశ్రమలో లవ్ కంటెంట్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు. బేబి కూడా అదే కోవలోకి వచ్చి చేరింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘బేబి’. ఇక వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే ఆమె చేసిన పాత్రను దారుణంగా తిడుతున్నారు. ఆనంద్ అద్భుతమైన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. ఈ సినిమా చూసిన యూత్ అయితే ఈ కథ నాదేనా అన్నంతగా కనెక్ట్ అయ్యారు. మరి కొందరైతే తమ పాత రోజులు గుర్తు చేసుకొనే సినిమా థియేటర్లలో ఏడ్చారు. ఈ సినిమా యూత్కి కనెక్ట్ అయ్యేలా తిశాడు డైరెక్టర్ రాజేష్. కొందరు సినీ ప్రముఖులు కూడా బేబి మూవీ పై ప్రశంసలజల్లు కురిపించారు. ప్రతి ఒక క్యారెక్టర్ అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజేష్ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైష్ణవిని తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమా కథ అనుకున్నప్పుడు తెలంగాణ అమ్మాయి కావాలనుకున్నాను. తెలంగాణ భాష మీద పట్టుండాలి అలాంటి అమ్మాయి అయితే నా కథకి న్యాయం చేస్తుందని అనుకున్నాను. వెంటనే మా మేనేజర్ వైష్ణవి ఫోటో చూపించాడు తనని సంప్రదించాను. వైష్ణవికి కథ చెప్పినప్పుడు ముందు ఒప్పుకోలేదు. తర్వాత నేను తీసే సన్నివేశాలు ప్రతి ఒక షాట్ అమెకి వివరించాను. అందులో నీకు నచ్చకుంటే మళ్లీ వేరే షాట్ తిద్దాం అని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లిపోయాం. నేను చెప్పిన ప్రతి సీన్లో తను అద్బుతంగా నటిచింది ఫ్యూచర్ లో ఆమె మంచి హీరోయిన్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. సినిమా ఇంత మంచిగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించాలాని కోరుకుంటున్నా అని డైరెక్టర్ చెప్పారు. చిన్న సినిమాగా విడుదలై ఇంత పెద్ద విజయం సాధించింది. దీనికి కారణమైన ప్రక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ స్పెషల్గా బేబి టీమ్ను అభినందించిన విషయం తెలిసిందే.