తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రముఖ దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం నాడు దర్శకుడు పరశురామ్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా సుమన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్ పాత్రధారి సముద్ర ఖనితో ఓ డైలాగ్ చెప్పించారు… ఇది ప్రస్తుతం కాంట్రవర్సీ అవుతుంది అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఎవరైనా బాధపడితే మనస్పూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సన్నిధికి రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది.. నేను ఆయనకు పరమ భక్తుడిని అన్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాను మొదలుపెట్టినప్పుడు స్వామిని దర్శించుకున్నాను.. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.. అందుకే వచ్చానని అన్నారు.
అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యతో ఒక మంచి సినిమా తీయాలని ఎప్పటి నుంచి ఆలోచనలో ఉన్నానని.. అది త్వరలో నెరవేరబోతుందని అన్నారు. అప్పన్న దర్శనానికి వచ్చిన పరుశరామ్ గుడిలో ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరు మీద అచ్చకుఅర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.