యాంకర్ రష్మీ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్. ‘జబర్దస్త్’ షోతో మొదలైన వీరి జర్నీ.. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమా స్నేహమా అనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్. ఇకపోతే రష్మీ.. యాంకరింగ్ తో పాటు అప్పుడప్పుడు హీరోయిన్ గానూ చేస్తూ ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం ఆమె చేసిన ‘గుంటూరు టాకీస్’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది కానీ హిట్స్ రాకపోయేసరికి పూర్తిగా వాటికి దూరమైపోయింది. ఆమె హీరోయిన్ గా రెండేళ్ల క్రితం చేసిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ తాజాగా రిలీజైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఇందులో భాగంగా ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, కమెడియన్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. సినిమా హిట్ కావాలని చెప్పారు. సుడిగాలి సుధీర్ కూడా రష్మీ గురించి మాట్లాడాడు. ఆమె తనని చాలా విషయాల్లో స్పూర్తిగా నిలిచిందని అన్నాడు. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన హాస్యనటుడు ధనరాజ్ కూడా రష్మీ వల్ల తన ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
‘జబర్దస్త్ నుంచి మా జర్నీ స్టార్టయింది. తనతో కొన్ని సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను. రష్మీ ఓ యానిమల్ లవర్. నా కొడుకు నాలుగేళ్లున్నప్పుడు మా ఇంట్లో ఓ డాగ్ ఉండేది. దాని హెయిర్.. మా పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయాయి. దీంతో మనం పెంచలేం ఏమోనని అమల గారి హాస్పిటల్లో ఇచ్చి వచ్చేశాను. ఇక కరోనా టైంలో మన తినడానికి సరిగా తిండిలేదు. ఆ టైంలో కూడా రష్మీ.. స్వయంగా ఫుడ్ వండి స్ట్రీట్ డాగ్స్ అన్నింటికి పంచిపెట్టింది. ఇలా రెండు నెలల పాటు చేసింది. అరే నేను ఒక్క డాగ్ నే చూసుకోలేకుండా ఇచ్చేశానే.. అసలు రష్మీ చేస్తున్న పనికి మనం సెల్యూట్ చేయాలి కదా అనిపించింది. దీంతో మళ్లీ ఓ డాగ్ ని తెచ్చుకుని పెంచుకుంటున్నాను. రష్మీ ఇలా నువ్వు చాలామందికి స్పూర్తిగా నిలుస్తున్నావ్’ అని ధనరాజ్ చెప్పాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు కూడా రష్మీ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.