Chiranjeevi Emotional Post On Taraka Ratna Death: ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ.. శనివారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. దాంతో తారకరత్న మృతిపై ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు 23 రోజులు కోమాలో ఉన్న తారకరత్న చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. దాంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇక తరకరత్న మృతికి పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తరకరత్న మృతిపై ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్న.. శనివారం నాడు తుది శ్వాస విడిచారు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. హీరోగా, విలన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న. అయితే చిన్న వయసులోనే ఇలా జరగడం బాధాకరం అని పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక తారకరత్న మరణంపై ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. “ఈ వార్త నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిశ్రమ ఓ అద్భుతమైన, టాలెంటెడ్ నటుడిని కోల్పోయింది. ఇంత చిన్న వయసులో తరకరత్న మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
Deeply saddened to learn of the
tragic premature demise of #NandamuriTarakaRatna
Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔
Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023