ఓ పేషంట్కు నాలుగు యూనిట్ల రక్తం అవసరం అయింది. సిటీ అంతా ఆ రక్తం కోసం వెతికారు. కానీ, ఎక్కడా దొరకలేదు. దీంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు సంప్రదించారు. హుటాహుటిన స్పందించిన బ్లడ్ బ్యాంకు అవసరమైన మేర రక్తాన్ని అందజేసింది.
మెగాస్టార్ చిరంజీవి మానవ సేవే, మాధవ సేవ అని గట్టిగా నమ్ముతారు. ఎవరికైనా అవసరం ఉందని తెలిసిన వెంటనే నేనున్నానంటూ సాయం చేస్తుంటారు. నలుగురికి సేవ చేయాలన్న గొప్ప లక్ష్యంతో బ్లడ్ అండ్ ఐ బ్యాంకును నెలకొల్పారు. బ్లడ్ బ్యాంక్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు నిలుపుకున్నారు. నిలుపుకుంటున్నారు కూడా. తాజాగా, ఓ పేషంట్ను బ్లడ్ బ్యాంకు ఆదుకుంది. ఆపరేషన్ నిమిత్తం రక్తం కోసం ఎదురు చూస్తున్న అతడికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం అందింది. దీంతో ఆపరేషన్ విజయవంతం అయింది.
పేషంట్ అల్లుడు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ గోపిశెట్టి మాట్లాడుతూ.. ‘‘ సికింద్రాబాద్ సౌమ్య హాస్పిటల్లో మా మావయ్య ఆపరేషన్ కోసం అత్యవసరంగా నాలుగు యూనిట్ల రక్తం అవసరమైంది. రక్తం కోసం సిటీ అంతా వెతికాం. ఎక్కడా అందుబాటులో లేదు. అప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను సంప్రదించాము. హుటాహుటిన మాకు కావలసిన నాలుగు యూనిట్ల రక్తం అందచేశారు. ఆపరేషన్ విజయవంతం అయింది. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు ద్వారా ఎన్నో లక్షలమంది ప్రాణాలు కాపాడబడ్డాయి.
ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు మా మావయ్యకు జరిగింది కూడా అదే. అందుకే మెగాస్టార్ చిరంజీవిని నిజమైన దేవుడిగా కొలుచుకునేది. ఈ సందర్భంగా నడిచే దేవుడు, పలికే భగవంతుడు, ఆదుకునే ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను నడిపిస్తున్న యాజమాన్యానికి, ముఖ్యంగా మాకు అన్ని విధాల సహకరిస్తున్న రవణం స్వామినాయుడుకు హృదయ పూర్వక అభినందనలు’’ అని అన్నారు. మరి, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.