మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భోళా శంకర్’ టీజర్ని ముందుగా ప్రేక్షకాభిమానుల కోసం థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసి, తర్వాత ఆన్లైన్లో వదిలారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్నారు. పాండమిక్ వల్ల గ్యాప్ రాకపోతే మరో రెండు సినిమాలు విడుదల చేసేవారే. చిరు సినిమాల లైనప్ చూసి యంగ్ హీరోలు, ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్లోని మాస్ యాంగిల్ని ప్రేక్షకులకు చూపించడానికి ఈతరం దర్శకులు పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘సైరా’ తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి చిరుతో జతకడుతుండగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా, ఆమె భర్తగా సుశాంత్ కనిపించనున్నారు. శనివారం సాయంత్రం ‘భోళా శంకర్’ టీజర్ రిలీజ్ చేశారు.
ముందుగా ప్రేక్షకాభిమానుల కోసం థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసి, తర్వాత ఆన్లైన్లో వదిలారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్, మేనరిజమ్స్, డైలాగ్స్తో కట్ చేసిన టీజర్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. చిరు గెటప్, బాడీ లాంగ్వేజ్ చూస్తే మరింత యంగ్గా కనిపిస్తున్నారు. ‘షికార్ కొచ్చిన షేర్ని బే.. స్టేట్ డివైడ్ అయినా అందరు నా వాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నాయే.. నాకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్’ అంటూ చిరు చెప్పిన డైలాగ్స్ డైనమెట్స్లా ఉన్నాయి. మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్, డడ్లీ విజువల్స్ హైలెట్ అయ్యాయి. సిస్టర్ సెంటిమెంట్తో పాటు చిరు నుండి ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో రూపొందిస్తున్న ‘భోళా శంకర్’ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది.