ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా బాలయ్య తో అన్ స్టాపబుల్ టాక్ షో ను స్టార్ట్ చేస్తున్నారు. ‘జోంబీ రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోగ్రామ్ ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. . దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రీమియర్ ప్రసారం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఇకపోతే ”అన్ స్టాపబుల్” టాక్ షో లో బాలకృష్ణ ఎలా ఉంటాడు అనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సూటు బూటు – కళ్ళద్దాలు ధరించి స్టైలిష్ లుక్ లో అలరించారు. వింటేజ్ బాలయ్య ని గుర్తు చేశారు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ‘సరదాలో స్టాప్ ఉండదూ.. సై అంటే సై.., నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. కలుద్దాం.. ఆహాలో అంటూ బాలయ్య డైలాగ్స్ అధిరిపోయాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు సినీ తారలు హాజరు కానున్నారు.
ఇందులో ఒక ఎపిసోడ్ కి మెగా హీరో కూడా వస్తారని.. మొదటి ఎపిసోడ్ లో మాత్రం మంచు మోహన్ బాబు గెస్టుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా బాలయ్య లాంటి దిగ్గజం బుల్లితెరపై కనిపించడం మొదటిసారి.. మరి ఆయన రేంజ్ కి తగ్గట్టు వచ్చిన గెస్టులతో ఎలా ఇంటర్వ్యూ తీసుకుంటాడు.. ఎలా అలరిస్తాడు అన్నది ‘అన్ స్టాపబుల్ టాక్ షో ’లో చూడాల్సిందే. ఈ షోకోసం నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.