తారకరత్న తన కళ్ల ముందే చనిపోవడంతో బాలయ్య ఆ విషాదం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నటుడు తారకరత్న చనిపోవడం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆ ఫ్యామిలీలో వరుస మరణాలు చోటుచేసుకుంటూ ఉండటం.. అభిమానుల్ని కూడా చాలా అంటే చాలా బాధపెడుతోంది. తాజాగా శివరాత్రి రోజు తారకరత్న శివైక్యం అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక సోమవారం, తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో తారకరత్న. ఒకేసారి 9 సినిమాలు అనౌన్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన అతడు.. హీరోగా పెద్ద గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నటుడిగా మాత్రం విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. 2024 ఏపీలో జరగబోయే ఎన్నికల కోసం సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే నారా లోకేష్ పాదయాత్రలో తొలిరోజు పాల్గొన్నాడు. నడుస్తూ కుప్పకూలిపోవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 23 రోజుల పాటు చికిత్స చేసినా లాభం లేకుండా పోయింది. తారకరత్న తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భార్య, పిల్లలు ఒంటరి వాళ్లు అయిపోయారు. ఇప్పుడు వాళ్ల బాధ్యతని బాలయ్య తీసుకున్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారు.
‘తను ఎంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం అంత తేలికైన విషయం కాదు. కొన్నాళ్లపాటు ఆమెకు (అలేఖ్య) ఈ ఒత్తిడి ఉంటుంది. తారకరత్న ఫ్యామిలీ మా కుటుంబంలో ఓ భాగమని బాలకృష్ణ చెప్పారు. అలేఖ్యారెడ్డిని, అమె పిల్లల బాగోగులు చూసుకుంటామని, వారితో సత్సంబంధాలు ఉంటాయని చెప్పడం నిజంగా గొప్ప విషయం. బాలకృష్ణగారికి తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుంది’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అలేఖ్యారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత తారకరత్నకు నిష్క అనే అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత కవలలు (బాబు-పాప) పుట్టారు. ఇప్పుడు తారకరత్న భార్య, పిల్లల బాగోగులు బాలయ్య చూసుకుంటానని నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి విషయమని నెటిజన్స్ అంటున్నారు. మరి తారకరత్న మృతి తర్వాత బాలయ్య ఈ నిర్ణయం తీసుకోవడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.