టాలీవుడ్ హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి! కానీ అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకే ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయట గొడవ పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే అమెరికాలోని డల్లాస్ లో జరిగినట్లు కనిపిస్తుంది. తాజాగా అక్కడ న్యూయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో బాలయ్య, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. వారి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. మాటామాటా పెరిగి కొట్టుకునేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే బాలయ్య వీరాభిమాని ఒకరు.. మెగా ఫ్యాన్స్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ పలువురికి గాయాలైనట్లు సమాచారం.
ఇక విషయానికొస్తే.. డల్లాస్ లో డిసెంబరు 31వ తేదీ రాత్రి న్యూయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ‘తగ్గేదే లే’ పేరుతో మ్యూజికల్ నైట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ తోపాటు బాలయ్య అభిమానులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే జై పవన్, జై బాలయ్య అని ఎవరికి వారు నినాదాలు చేశారు. అలానే తమకు నచ్చిన పాటలు కావాలంటూ పట్టుబట్టారు. ముందు బాలయ్య పాటలు వేయగా, మరికొందరు చిరంజీవి సాంగ్స్ కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటామాటా పెరిగి దాడుల చేసుకునే వరకు వెళ్లింది. దీంతో అక్కడి ఈవెంట్ మేనేజర్లు.. పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఏం చేయలేకపోయారు. వాళ్లకు కూడా గాయాలయ్యాయి. చేసేదేం లేక ఈవెంట్ మేనేజర్స్.. సెక్యురిటీగా ఉన్న పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే బాలయ్య అభిమాని, ఎన్నారై అయిన కేసీ చేకూరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్ చేసుకున్న చోటు నుంచి డల్లాస్ పోలీస్ స్టేషన్ కు చేకూరిని తరలించారు. ఇక ఈ గొడవలో పలువురికి గాయాలవగా.. వారిని దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఈ గొడవంతా కూడా అన్ స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ రావడంతోనే షురూ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే మాటామాటా పెరిగి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు, బాలయ్య సినిమా పోస్టర్లతో ఫ్యాన్స్ కొట్టుకుంటున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో ఇది కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి డల్లాస్ లో చిరు-బాలయ్య ఫ్యాన్స్ గొడవ పడటంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.