గ్లామరస్ యాంకర్ చాలామందికి గుర్తొచ్చే ముద్దుగుమ్మ అనసూయ. ఈమెని చూస్తే.. అలానే చూస్తూ ఉండిపోవాలని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే క్రేజీ ఫొటోషూట్స్ తో ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ చేతినిండా పనితో ఫుల్ బిజీ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ పెట్టడం లేటు. నెటిజన్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. ఆమె అందులో ఏం చెప్పిందా అని ఆసక్తిగా చూస్తారు. అలా పోస్ట్ చేసిన ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత ‘జబర్దస్త్’ యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఫేమ్ అయితే లెక్కలేనంత సంపాదించింది. ఎందుకంటే యాంకర్ గా చేస్తున్న టైంలోనే ఈమెకు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. రంగస్థలం, పుష్ప లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన అనసూయ.. నటిగానూ ప్రూవ్ చేసుకుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.
‘నేను ఓ డిజార్డర్ తో బాధపడుతున్నా. నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వారిని అస్సలు లెక్కచేయను. వారి గురించి పట్టించుకోకపోవడమే నా రుగ్మత’ అని వేరొకరి వాయిస్ తో సింక్ చేసిన ఓ వీడియోని తన అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్టుల వల్ల కావొచ్చు, పలు కామెంట్స్ వల్ల కావొచ్చు ఈమెని చాలామంది ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లనే టార్గెట్ చేస్తూ.. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ట్రోల్ చేసినా తాను లెక్కచేయనంటూ పరోక్షంగా ఈ వీడియో ద్వారా అనసూయ చెప్పినట్లు అనిపిస్తుంది. మరి అనసూయ వీడియో చూసి మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.