చిత్ర పరిశ్రమలో నటులు దర్శకులుగా మారడం.. దర్శకులు నటులుగా మారడం సహజమే. అలాగే చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకుంటారు. ఈ క్రమంలో డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడిగా మరిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. తొలుత తమిళ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నాడు. తాజాగా హీరో నితిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన గత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడిగా మారిన వ్యక్తి అమ్మ రాజశేఖర్. హీరో గోపీచంద్ నటించిన ‘రణం’మూవీ ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మెుదటి చిత్ర విజయంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత రవితేజ-ఇలియానా జంటగా ‘ఖతర్నాక్’ సినిమా తీయగా అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ..
”ఖతర్నాక్ మూవీ సమయంలో విడుదల తేదీ దగ్గరకు వస్తోందని నేను షూటింగ్ చేస్తూంటే.. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎడిట్ చేశారు. అది సరిగా లేదు. మనీ కంట్రోల్ నా చేతిలో లేకుండా పోయింది. ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ లను సరిగా ట్రిమ్ చెయ్యలేదు. లాస్ట్ లో చేస్తానని చెప్పినా అప్పటికే ఫస్ట్ కాపీ వెళ్ళిపోయిందని చెప్పారు. కో ఆర్డినేటర్ నన్ను మోసం చేశాడని” అమ్మ రాజశేఖర్ వాపోయాడు.
”అలా ఫస్ట్ కాపీ వెళ్ళిపోయినప్పుడు ప్రసాద్ ల్యాబ్ లోనే ఏడుపు వచ్చి గడ్డిలో పడి దొర్లానని చెప్పాడు. ఆ క్రమంలో హీరో గోపీచంద్ కు రణం సమయంలో కథ చెప్పగా చాలా బాగుందని, మనం చేద్దాం అని అన్నాడు. తరువాత చూస్తే తండ్రీ కొడుకుల కథగా ‘శంఖం’ వచ్చిందన్నారు. అప్పుడు చాలా బాధ పడ్డ.. గోపీ ఇలా ఎందుకు చేశాడా అని. చాలా మంది నన్ను ఇలా మోసం చేశారు.” అని అమ్మరాజశేఖర్ వివరించాడు. మరి అమ్మరాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.