సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా గెలుపొటములు సహజం. అయితే ఇండస్ట్రీలో వీటి ప్రభావం కాస్త అధికంగా ఉంటుంది. ఓ సినిమా రిజల్ట్.. దాని తర్వాత తెరకెక్కబోయే ప్రాజెక్ట్స్ని ప్రభావితం చేస్తుంది. సినిమా విజయం సాధించింది అంటే.. ఆ చిత్ర దర్శకుడు, హీరోతో కొత్త కాంబినేషన్లు సెట్ అయ్యే అవకాశం ఉండటమే కాక.., పాత కాంబినేషన్లు రిపీట్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. కానీ.., రిజల్ట్ కాస్త తగ్గినా.. ఆ ప్రభావం నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పడుతుంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ విషయంలో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ లభించింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: రివ్యూలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆచార్యలో చిరంజీవి, రామ్ చరణ్ డ్యాన్స్, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఇలా ప్రతిది ప్రేక్షకులకు ఐపీస్ట్లాగా ఉన్నాయి. తెరమీద వీరిద్దరిని చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదని.. ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి మరి నటించారని.. ఇద్దరి డ్యాన్స్ చూడ్డానికి కన్నులపండగలా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్యకి ఇవన్నీ ప్లస్ గా ఉన్నా.. కొరటాల ఎంచుకున్న కథ, కథనం మైనస్ అయ్యాయి.కొరటాల శివ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే పెన్ పవర్.. ఈ చిత్రంలో కాస్త తగ్గిందన్న టాక్ బయటకి వచ్చింది. ఆయన గత చిత్రాలు జనతా గ్యారేజ్, భరత్ అనే నేనుతో పోలీస్తే.. ఆచార్య చిత్రంలో కొరటాల శివ స్పెషల్ స్పార్క్ మిస్సయింది అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఆచార్య సినిమాకు ఇలా మిక్స్డ్ టాక్ రావడంతో.. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు తెగ భయపడుతున్నారు.
Koratala template…
A has a goal which was foiled by B.
Enters X , achieves the goal of A.#Acharya #KoratalaSiva pic.twitter.com/LODpfrcsvV— Greenleaf (@Pan_TFIfan) April 29, 2022
ఇది కూడా చదవండి: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! OTT లో ఆచార్య..
కొరటాల శివ తన నెక్స్ట్ ప్రాజెక్ట్.. జూనియర్ ఎన్టీఆర్తోనే అని ప్రకటించాడు. ఇప్పుడు భారీ అంచనాలతో తెరకెక్కిన ఆచార్యకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. చిరు-చరణ్ మల్టీస్టారర్ క్రేజ్ ఆ మూవీని కాపాడుతుంది. కానీ.., ఇలాంటి అవుట్ డేటెడ్ స్టోరీ లైన్ మళ్ళీ తారక్ కి కూడా పడితే..? మొదటికే మోసం వస్తుంది అని ఫ్యాన్స్ తెగ హైరానా పడుతున్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత యన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమాని ఫిక్స్ చేసుకుని ఉన్నాడు. ఇలా మొత్తం లైనప్ సెట్ చేసుకున్నాక ప్లాప్ పడితే ఆ ఫ్లో అంతా దెబ్బ తింటుంది. ఇందుకే.. కొరటాల విషయంలో జూనియర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరటాలతో సినిమా వద్దంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కొరటాల-జూనియర్ కాంబినేషన్లో ఇప్పటికే జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా వచ్చినప్పటికీ.. తారక్ ఫ్యాన్స్ ఇలా భయపడుతుండటం విశేషం. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తారక్ అన్న కొరటాలతో మనకి మూవీ వద్దు. వెనక్కి వచ్చేయి.
— bade raja (@baderaja04) April 29, 2022
ఇది కూడా చదవండి: Acharya: ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావడానికి ఎన్ని కోట్లు రావాలంటే..!