ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషాద వార్తలు వింటూ వస్తున్నాం. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ఆమె బామ్మ మరణించారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషాద వార్తలు వింటూ వస్తున్నాం. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ఆమె బామ్మ మరణించారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యింది. ఎవరైనా సరే.. బాగా క్లోజ్ అయినవారిని కోల్పోతే ఆ బాధ నుండి తేరుకోవడం చాలా కష్టం అవుతుంది. పైగా వారి జ్ఞాపకాలు.. లైఫ్ లాంగ్ మనతో ఉంటాయి. ఆ హీరోయిన్ ఎవరంటే.. మేఘా ఆకాష్. తన బామ్మని కోల్పోవడంతో మేఘా మానసికంగా బాగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టును గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.
మేఘా పోస్ట్ లో.. ‘డియర్ అమ్మమ్మ.. నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావట్లేదు. అయినా నేను నీలాంటిదాన్నే. కాబట్టి.. ఎలాగైనా బతికేస్తాను అని అనుకుంటున్నా. ఎంతో సరదాగా ఉండే నువ్వు ఎల్లప్పుడూ అందరి ఆకలి తీర్చేందుకే ప్రయత్నించేదానివి. ఎలాంటి సమయంలోనైనా అందరినీ నవ్వించేదానివి. రోజు నీతో పెట్టిన ముచ్చట్లు బాగా గుర్తొస్తున్నాయి. ప్రతీ ఆదివారం మనకు ఎంతో సరదాగా గడిచేది. ఇకపై ఆదివారాలు అలా ఉండవు. మాతో లేకపోయినా.. మాలో ఎప్పుడూ ఉంటావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ తన ఆవేదన తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇక మేఘా ఆకాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. లై, ఛల్ మోహన్ రంగా, డియర్ మేఘా లాంటి సినిమాలు చేసింది.