పేకాట ఆడటం చట్టప్రకారం తప్పు. పోలీసులకు మీరు ఆడుతున్నట్లు దొరికితే జైలులో వేస్తారు. ఇక టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఆన్ లైన్ రమ్మీ ఆడేవారి సంఖ్య పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే పలు యాప్స్.. సోషల్ మీడియాలో యాడ్స్ తో హోరెత్తిస్తుంటాయి. దానికి పలువురు ఇన్ఫ్యూయెన్సర్లు, నటీనటుల ప్రచారం చేస్తుంటారు. సదరు రమ్మీ యాప్స్ వల్ల పలు వివాదాలు తలెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లో వీటిపై చాన్నాళ్ల క్రితమే నిషేధం విధించారు. ఇప్పుడు ఇదే ఆటపై ప్రముఖ నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్సీకి కారణమయ్యాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ఆన్ లైన్ రమ్మీతోపాటు బెట్టింగ్ గేమ్ ని బ్యాన్ చేస్తూ, అక్కడి ప్రభుత్వం కొత్తగా ఓ జీవో తీసుకొచ్చింది. కానీ అది ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్ లోనే ఉంది. ఈ బిల్లుని రాజ్ భవన్ వర్గాలు పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఆమోదించాలని అన్నివైపుల నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఆన్ లైన్ రమ్మీకి నటుడు శరత్ కుమార్ పబ్లిసిటీ చేస్తుండటం వివాదాలకు దారితీస్తోంది. ఈ గేమ్ ని ప్రోత్సాహించే విధంగా శరత్ కుమార్ యాడ్స్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయనకు.. మీడియా దీని గురించి ప్రశ్నించింది.
‘రమ్మీ అనేది ఓ నాలెడ్జ్ గేమ్. ఇది ఆడటంతో తప్పేముంది. ప్రభుత్వం ఈ జీవో ఇవ్వడానికంటే ముందే.. అంటే రెండేళ్ల క్రితమే నేను ఆ యాడ్ లో యాక్ట్ చేశాను. ఇకపోతే నేను చెప్పినంత మాత్రాన అందరూ పేకాట ఆడేస్తారా? ఇంత నిజాయతీగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేస్తుంటేనే జనాలు ఓట్లు వేయడం లేదు. మరి నేను ఆడమంటే రమ్మీ ఆడేస్తారా ఏంటి?’ అని చాలా డిఫరెంట్ గా మీడియాకు శరత్ కుమార్ సమాధానమిచ్చారు. దీంతో శరత్ కుమార్ పై విమర్శలు వస్తున్నాయి. అలా ఎలా చెబుతారంటూ పలువురు నెటిజన్స్ తోపాటు రాజకీయ నాయకులు కూడా కౌంటర్స్ వేస్తున్నారు. మరి పేకాట(ఆన్ లైన్ రమ్మీ) పై శరత్ కుమార్ మాట్లాడటం గురించి మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
sunnewstamil: #Watch | “2 வருஷத்துக்கு முன்பே, ரம்மி தடை சட்டம் வந்திருந்தால் விளம்பரத்தில் நடித்திருக்க மாட்டேன்” – சமத்துவ மக்கள் கட்சித் தலைவர் சரத்குமார் #SunNews | #Sarathkumar | #OnlineRummy | @realsarathkumar pic.twitter.com/BBrMpEyBG3
— Parundhu News (@Parundhu_News) December 13, 2022