గత కొంత సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ మారాఠి నటుడు ప్రదీప్ పట్వర్ధన్ కన్నుమూశారు. మంగళవారం ముంబైలోని తన స్వగృహంలో ప్రదీప్ పట్వర్ధన్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరాఠీ ఇండస్ట్రీలో ప్రదీప్ పట్వర్థన్ తనదైన నటనతో లెజెండరి యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు.
ఆయన నటించిన ‘ఎక్ ఫుల్ ఛార్ హాఫ్’, ‘డాన్స్ పార్టీ’, ‘మే శివాజీరాజీ భోంస్లే బోల్తె’ ఆయనకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. ఇటీవల అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ క్రైం థ్రిల్లర్ మూవీలో కూడా ప్రదీప్ నటించారు. అలాగే పలు మరాఠి టివి సీరియల్స్ లో నటించారు.
నటుడు ప్రదీప్ పట్వర్ధన్ మృతికి మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులు అర్పించారు. ‘ప్రదీప్ గొప్ప నటుడు.. ఆయన తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.. ప్రదీప్ పట్వార్థన్ మరణం నన్ను ఎంతో బాధించింది. మరాఠి ఇండస్ట్రీ ఓ లెజెండరి నటుడిని కొల్పోయింది’ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆయన మృతికి సినీ, టీవీ నటీనటులు సైతం ప్రదీప్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
मराठी रंगभूमीवरील मोरूची मावशी, बायको असून शेजारी, लग्नाची बेडी तसेच मराठी चित्रपटसृष्टीत आपल्या सहजसुंदर अभिनयाने रसिक प्रेक्षकांच्या हृदयावर अधिराज्य गाजवणारे सदाबहार अभिनेते प्रदीप पटवर्धन यांचे दुःखद निधन झाले. त्यांच्या जाण्याने मराठी कलासृष्टीने उमद्या कलावंताला गमावले आहे. pic.twitter.com/CVjESFYCkf
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) August 9, 2022