మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. తొలి సారి మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ లో స్కీృన్ షేర్ చేసుకోబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చాలాసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఓ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది ఆచార్య మూవీ టీమ్. ఈ చిత్రాన్ని హిందీ లో విడుదల చేయడంలేదని తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సౌత్ లోనే కాకుండా నార్త్ లోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆచార్య మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆచార్య టీమ్ వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని.. హిందీ వర్షన్ లో మాత్రం రిలీజ్ చేయడంలేదంటా. దీనిపై ఆచార్య చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. హిందీ వర్షన్ సినిమాను రిలీజ్ చేయాలంటే డబ్బింగ్.. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుందని.. ఇప్ప్పుడు అంత సమయంలో లేకపోవడంతో ఏప్రిల్ 29 నాటికి హిందీ వర్షన్ రెడీ చేయలేకపోయామని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు కాకాపోయిన కొన్నిరోజుల తరువాతనైనా ఆచార్య సినిమాను కచ్చితంగా హిందీ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. దీంతో నార్త్ లో ఆచార్య మూవీ రిలీజ్ లేనట్లే అని తెలిపోయింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.