ఎక్కడున్నా ఏ పనిచేసినా సరే తమకంటూ సొంతంగా కొన్ని ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాటిలో ఇల్లు, బైక్, కారు లాంటివి కచ్చితంగా ఉంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వీటిని అచీవ్ చేసుకునేందుకు కష్టపడుతుంటారు. లైఫ్ లో ఓ దశలో వాటికి యజమానులు అవుతారు. ఈ మధ్య కాలంలో చాలామంది సీరియల్, బిగ్ బాస్ సెలబ్రిటీలు.. ఇల్లు కొనేస్తున్నారు. కొత్త కార్స్ కి ఓనర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ దంపతులు కూడా చేరిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… ఇప్పుడంటే డ్యాన్స్ షోలకు ఆదరణ తగ్గిపోయిందని ఓ పది పదిహేనేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ లాంటి షోలు తెలుగునాట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ప్రతి వీకెండ్ లోనూ వాటిని చూసేందుకు ప్రేక్షకులు తెగ ఎదురుచూసేవారు. అలా ‘ఆట’ తొలి సీజన్ విన్నర్ గా నిలిచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. ఆ తర్వాత కాలంలో ఆట సందీప్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. తన తోటి డ్యాన్సర్ అయిన జ్యోతిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
ప్రస్తుతం చిన్న సినిమాలు, ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ కాస్త బిజీగానే ఉన్న సందీప్ మాస్టర్ దంపతులు.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో షార్ట్ వీడియోలతో పాటు యూట్యూబ్ లో వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు. అలా నెటిజన్స్ కి ఈ జంట పరిచయమే. ఇప్పుడు వీళ్లు కొత్తగా ఇల్లు కొన్నట్లు చెప్పుకొచ్చారు. ఐదేళ్లు కష్టపడి ఫ్లాట్ సొంతం చేసుకున్నామని చాలా ఆనందంగా చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.