నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో 2012లో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ డెబ్యూ చిత్రం ముంకుందా సినిమాలో నటించి కొంతకాలానికి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అనంతరం అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో, మహేష్ సరసన మహార్షిలో, వరణ్తో గద్దల కొండ గణేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో అరవింద సమేత వీరరాఘవ సినమాల్లో నటించి సూపర్ హిట్లను అందుకుంది. మోడల్గా కెరీర్ ఆరంభించిన ఈ బ్యూటీ తొలుత తమిళ సినిమాలో నటించింది. అనంరతం తెలుగులో ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది.
భారీ భారీ సినిమాల్లో నటిస్తుంది టాప్ గేర్లో దూసుకెళ్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధ్యేశ్యామ్, అక్కినేని నట వారసుడు అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలోను నటించే అవకాశం పూజాకు దక్కింది. తమిళ్లో దళపతి విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్కళ్యాన్, సూపర్ స్టార్ మహేష్ బాబుల 28వ చిత్రాల్లో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్. బాలీవుడ్లో కండలవీరుడు సల్మాన్ ఖాన్తో భాయ్జాన్ సినిమాతో పాటు మరో చిత్రానికి సైన్ చేసింది. ఇలా వరుసగా ఎనిమిది పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ అదరిపోలా అన్నట్టు కెరీర్ను ముందుకు పరిగెట్టిస్తోంది. ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని పూజా హెగ్డే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.