సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి దాపరించింది. మనుషులు కాస్త మానవ మృగాలుగా మారుతున్నారు. కామంతో వాయి వరసను మరిచి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన మార్పు మాత్రం కంటికి కనిపించటం లేదు. నిర్భయ లాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక నేటి కొందరు యువకులు అది ఇస్తాము ఇది ఇస్తాము అని ఆశ చూపి మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు.
ఇక తాజాగా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పరిగి మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు అదే గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి తెగ బడ్డాడు. ఆ బాలిక తల్లిదండ్రులు పొలం పనుల నిమ్మిత్తం వెళ్లటంతో అదును చూసి బాలికై ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఇక ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసుల చెంతకు చేరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.