వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక శీరీష(19) ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అత్యంత ఆటవికంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి కుంటలో పడేసారు. అయితే హత్యచేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక శీరీష(19) ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అత్యంత ఆటవికంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసి కుంటలో పడేసారు. అయితే హత్యచేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు. శీరీష రాత్రి నుంచి బయటకు వెళ్లే కంటే ముందే అక్క భర్త అనిల్ తో గొడవ పడిందని.. ఆ గొడవలో శీరిష్ ను అనిల్ కొట్టినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అనిల్ మీద అనుమానం వచ్చిన పోలీసులు.. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అర్థం లేకుండా మాటలు చెప్తూ.. పోలీసులనే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్. అయితే పోలీసులు మరింత గట్టిగా విచారణ చేపట్టారు. అంతే కాదు శీరీష మెుబైల్ విషయంలో గొడవ జరిగినట్టు శీరిష అన్న కూడా చెప్పడంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవలే కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శీరీష ఎప్పుడు ఫోన్ పట్టుకుని ఉండడంతో అన్న మందలించాడు. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నావంటూ తిట్టడంతో గొడవ కాస్త పెద్దగా అయింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భావ అనిల్ శీరీష్ ను మందలించడంతో పాటు కొట్టాడు. దీంతో శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదిలా ఉండగా శీరీషను అర్ధరాత్రి కలుద్దామని బావ అనిల్ ను బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత తలుపును బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. అయితే ఇద్దరు కలుసుకున్న తర్వా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శీరిషను అత్యంత దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అక్క భర్త అనిల్, శీరీషకి మధ్య వివాహేతర సంభందం ఉందని పోలీసులు విచారణలో బయటపడినట్లు తెలుస్తుంది.ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటర్ దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. శీరీష ను రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు తలకు బలమైన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.తాజాగా శీరీష హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావతో పాటు మరికొంతమంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.
శనివారం రాత్రి జరిగిన శీరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీసారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు శీరిష మృతదేహానకి వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్యులు, అత్యాచారం జరిగిందా.. లేదా.. అనేదాన్ని పరీక్షల్లో నిర్దారించనున్నారు. పరీక్షల కోసం పరిగి నుంచి డాక్టర్ వైష్ణవి వచ్చారు. నీటికుంటలో పడినపుడు శిరీష కళ్లకు రాళ్లు గుచ్చుకొని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడిచేశారా? అనే కోణంలోనూ దర్యాప్తూ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోస్టుమార్టం నివేధిక కీలకంగా మారింది. శీరీషను చంపిందెవరో ఆమె తండ్రికి తెలుసని గ్రామస్ఠులు ఆరోపిస్తున్నారు.