ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. ఈ లీకేజ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ లో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ వెలుగులోకి వచ్చిందన్నారు. నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గిరిధర్ పలు కీలక విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వైస్ ప్రన్సిపల్ గిరిధర్ ఒప్పుకున్నారు.
ఈయన వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం మాజీ మంత్రి నారయణను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో మంగళవారం ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ పని చేసినట్లు చిత్తూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారుగా తెలుస్తోంది. మరి.. ఈ లీకేజీలు, అరెస్టుల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.