వేదాలు చదువుకున్న వ్యక్తి కాదు. శాస్త్రాలు అవపోసన పట్టినవాడు కాదు. పూజలు ఎలా చేస్తారో తెలీదు. కానీ, 22 ఏళ్లుగా అమ్మవారికి అన్నీ తానై పద్ధతిగా.. మంత్రోచ్ఛారణలతో పూజలు చేస్తున్నాడు. అయితే ఆ పూజలు చేస్తుంది ఒక ముస్లిం వ్యక్తి. ఆయన ఎవరు? ఎందుకు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నూలు జిల్లా పాపిలికి చెందిన చెందిన ఇమామ్ దాదాపు 30 ఏళ్ల నుంచి డోన్లో ఉంటున్నాడు. నేషనల్ హైవే 7 మీద ఉన్న ఒక హోటల్లో వెయిటర్గా పనిచేసేవాడు. ఇమామ్ పనిచేస్తున్న హోటల్ ఎదురుగా ఒక గుడి ఉంది. రోజు ఇమామ్ బాషా అమ్మవారిని పూజించేవాడు. ఆ తర్వాత రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా అమ్మవారి గుడిని తొలగించారు. దాతల సాయంతో 2007లో నిర్మాణం మొదలుపెట్టి 2010లో పూర్తి చేశారు. అమ్మవారి మీద భక్తితో 22 ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నాడు. ఇమామ్ బాషా ముస్లిం కావడంతో అమ్మవారి పూజ చేసేందుకు మొదట్లో చాలామంది వ్యతిరేకించారు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా.. పట్టించుకునేవాడు కాదు.ప్రస్తుతం బాషా తన కుటుంబానికి విడిగా జీవనం సాగిస్తున్నాడు. కానీ భార్య మాత్రం తనకు అండగా నిలిచి ధైర్యం చెప్తుంది.ఇమామ్ భక్తికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇమామ్ ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి పూజలు అభిషేకాలు చేస్తారు. అమ్మవారు కలలో కొచ్చి పూజలు చేయమని కోరిందని, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అమ్మవారి సేవకు తన జీవితం అంకితం అని, మతం ఏదైనా.. దైవం ఒక్కడే అని నిరూపిస్తున్నాడు ఇమామ్. అల్లా అయినా.. అమ్మవారైనా అందరూ దేవుళ్లే ఒక్కటే అని ఇమామ్ భాషా అంటటున్నాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.