పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న చిత్రం యూనివర్సిటీ. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ మద్య తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారలు పెద్ద దుమరారం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పూర్తి కాకముందే.. టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు లీక్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ కేసులో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ ఐఆర్ లో బండి సంజయ్ ని ఏ1గా చేర్చారు. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివే విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నిన్న తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్.. ఈ రోజు వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
Telangana: రాష్ట్రంలో వరుస పేపర్ లీకులు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరి ఈ స్థాయిలో లీకులు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.