ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వాతవరణంలో పలు రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు సూర్యడు తన ప్రతాపాన్నిచూపిస్తుంటే.. మరోవైపు కారుమబ్బులు పట్టడంతో వరుణడు హూరెత్తిస్తున్నాడు.
ఈ మద్య వాతావరణం లో చిత్రవిచిత్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. అప్పుడే భరించలేని ఎండలు కొడితే.. ఒక్కసారే కారుమబ్బులు కమ్ముకొని వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వానలు కూడా పడుతున్నాయి. అంతలోనే మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణ లో రాబోయే మూడు రోజులు పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి.. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 4 వ తేదీ వరకు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజులు ఈదురుగాలులు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఊదరు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పగటి పూట ఉష్ణోగ్రత 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు అని తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు మండిపోయాయి.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ తర్వాత వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవించాయి.. మబ్బులు పట్టడంతో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులుతో కూడిన వర్షం పడింది. హైటెక్ సిటి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.. ఇక గాజుల రామారం, జీడిమెట్ల, దూలపల్లి తో పాటు పంజాగుట్ట, కుకట్ పల్లి, మెహదీపట్నం, అమర్ పేట, మణికొండలో వర్షం కురిసింది. మొత్తానికి వర్షంతో నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగిందని ఆనందిస్తున్నారు.