గత కొంత కాలంగా గుండెపోటుతో టీనేజ్ యువకుల చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోన్న విషయం. తాజాగా మరో విద్యార్థి కాలేజ్ లోనే గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.
గత కొంత కాలంగా గుండెపోటుతో టీనేజ్ యువకుల చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోన్న విషయం. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మాయ జబ్బు అందరిని కబళిస్తోంది. కొన్ని రోజుల క్రితం వివాహ వేడుకలో నృత్యం చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించిన సంఘటన మరువక ముందో మరో సంఘటన రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ మధ్య కాలంలో విద్యార్థులు గుండెపోటు రావడం ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్న అంశం. తాజాగా బీటెక్ విద్యార్థి ఒకరు కాలేజీలోనే గుండెపోటుతో కుప్పకూలడం సంచలనం రేపింది.
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ CMR ఈసీ ఇంజినీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సచిన్(18) అనే విద్యార్థి. ఇక రోజూలానే ఈ రోజు కూడా కాలేజీకి వచ్చాడు సచిన్. మధ్యాహ్నాం భోజనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి క్లాస్ కు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.వరండాలో నడుచుకుంటూ.. క్లాస్ కు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు సచిన్ ను హుటాహుటిన సీఎంఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సచిన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. గొప్ప చదువులు చదివి, ఉన్నత ఉద్యోగం సాధిస్తాడు అనుకున్న కొడుకు ఇలా విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇలాటి ఘటనలు కంటిన్యూస్ గా జరగడం అనేది చాలా విచారకరమైన, ఆందోళన కరమైన విషయంగా ప్రముఖులు పేర్కొంటున్నారు.
— Hardin (@hardintessa143) March 3, 2023