పేద కుటుంబంలో జన్మించి.. స్వయం కృషితో ఉన్నత స్థితికి ఎదిగిన మహానీయుల ఎందరో ఉన్నారు. వాళ్లు పేదరికంలో పుట్టడం తప్పుగా భావించలేదు. ఆ పేదరికంలోనే మరణించకుడదని దృఢంగా సంకల్పించారు. అందుకే స్వయం కృషితో జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో నిలిపోయారు. మరికొందరు అయితే ఉన్నత స్థితికి చేరడంతోనే ఆగిపోలేదు… తాము సంపాదించిన సొమ్ములో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. అలా పేదరికం నుంచి వచ్చి సమాజానికి సేవ చేసిన అబ్దుల్ కలామ్, రతన్ టాటా వంటివారు నేటితరం యువతకు ఆదర్శం. వారిని ఆదర్శంగా తీసుకున్న జీవితంలో పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సింగోటం రామన్న. ఆటో డ్రైవర్ గా మొదలై.. ఎన్నో సేవా కార్యాక్రమాలు చేసే స్థాయికి ఎదిగారు. నేటితరం యువతకు సింగోటం రామన్న ఆదర్శం.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన సింగోటం రామన్న.. హైదరాబాద్ లో ఆటోడ్రైవర్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్లి.. బాగా సంపాదించారు. ఇదే సమయంలో ఆయనకు సమాజానికి సేవ చేయాలని తపన ఏర్పడింది. హైదరాబాద్ లోని మణికొండకు చెందిన శివ అనే వ్యక్తి అబ్దుల్ కలామ్ గురించి చెప్పడంతో రామన్న స్ఫూర్తి పొందారు. అబ్దుల్ కలామ్ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలు సాయం చేస్తున్నారు. సాధారణ కుటుంబ నుంచి వచ్చి.. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించిన అబ్దుల్ కలామ్ తనకు ఆదర్శమని రామన్న తెలిపారు. తన వ్యాపారంలో వచ్చే లాభాల్లో 80 శాతం పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. నిరుపేదలకు ఆర్ధిక సాయం చేయడం, కాలేజిలో సీట్ వచ్చి కూడా ఆర్థిక సమస్యలతో చదువుకోలేని విద్యార్ధులకు సాయం చేయడం వంటివి చేస్తున్నారు.
అంతేకాక పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్లకు కట్నకానుకలు అందిస్తున్నారు. ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్న పేదవారికి చికిత్స చేయిస్తున్నారు. ఏమి చదువుకోకుండా ఆటో డ్రైవర్ గా జీవనం మొదలు పెట్టి.. వేలాది మందికి రామన్న సాయం చేస్తున్నారు. అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా సాధారణ వ్యక్తి నుంచి పేదలకు సాయం చేసే నేతగా రామన్న ఎదిగిన తీరు నేటి తరం యువతకు ఆదర్శం. మరి.. ఆటో డ్రైవర్ నుంచి ప్రజా సేవకుడిగా ఎదిగిన సింగోటం రామన్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.