ఈ కాలం పిల్లలను పది పైసలకి ఏమి వస్తుంది అని అడిగితే..అసలు పది పైసలు అంటే ఏమిటి అనే స్థితిలో ఉంది ఆ కాయిన్. కానీ ఓ వ్యక్తి అదే పది పైసలను లెక్కల రూపంలో పెంచి రూ.2 కోట్లు నొక్కేశాడు. దీని వెనుక రైస్ మిల్లర్లు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. మీరు విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇది రాష్ట్రంలోని భారత ఆహార సంస్థ(FCI)లో జరిగింది. మరి అసలు ఏంటి ఈ కుంభకోణం, దీనివెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్న విషయం తెలిసిందే. దానిని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తుంది. మిల్లర్లు మిల్లింగ్ చేసిన అనంతరం ధాన్యాన్ని సదరు ఆహార సంస్థకు అందించాలి. FCI ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చే కేటాయింపులకు అనుగుణంగా సదరు బియ్యాన్ని గోదాములకు తరలించాల్సి ఉంటుంది. ఈ పక్రియలో 8 కిలోమీటర్ల పరిధిలో గోదాము ఉంటే ఎటువంటి ఛార్జీలు చెల్లించదు కేంద్ర ఆహార సంస్థ. అంతకంటే ఎక్కువ దూరం ఉంటే క్వింటా బియ్యానికి.. కిలో మీటరుకు 63 పైసలు చెల్లిస్తారు. అలా ఒక్కో లారీలో దాదాపు 290 క్వింటాళ్ల బియ్యం రవాణా చేస్తారు. అయితే, తనకు అధికారం లేకపోయినా.. డీజీఎం స్థాయి అధికారి ఒకరు జోక్యం చేసుకున్నారు.
63 పైసలున్న రవాణా చార్జీని 73 పైసలకు పెంచారు. ఆ మేరకు ఇతర అధికారులూ బిల్లులు మంజూరు చేసేశారు. పది పైసలు పెంచడంతో కలిపి ఆ సీజన్లో రవాణా చార్జీలకు సంబంధించిన మొత్తం బిల్లు రూ.400 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని మిల్లర్లకు ఎఫ్సీఐ కూడా చెల్లించింది. చార్జీని కిలోమీటరుకు పది పైసలు పెంచడమే కాకుండా కొర్రీలు లేకుండా బిల్లులు మంజూరు చేసినందుకు సదరు ఉన్నతాధికారికి రూ.2 కోట్లను రైస్ మిల్లర్ల అసోసియేషన్ ముట్టజెప్పినట్లు ఎఫ్సీఐ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీని పై విచారాణ చెపట్టిన ఉన్నతాధికారులు..నిజమేనని నిగ్గు తేల్చారు. అక్రమాలకు బాధ్యుడైన డీజీఎంను పంజాబ్కు బదిలీ చేశారు. మరి ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.