భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీకి భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. తాజాగా ఐసీసీ ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు ఆడనున్నాయో తెలిసిపోయింది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మరోసారి ఈ వరల్డ్ కప్ భారత్ లో నిర్వహిస్తున్నారు. ఇక స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో వరల్డ్ కప్ మీద అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్ళు దాటిపోయిన టీమిండియాకు ఈ సారి వరల్డ్ కప్ గెలవడానికి ఇదొక సువర్ణావకాశంగానే చెప్పుకోవచ్చు. గత మూడు వరల్డ్ కప్ తీసుకుంటే స్వదేశంలో నిర్వహించిన జట్టే వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ సారి కప్ మన టీమిండియాకే అని అభిమానుల నుంచి ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. తాజాగా వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ ని ఐసీసీ విడుదల చేసింది. దీని ప్రకారం భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసుకుందాం.
మాములుగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇక వరల్డ్ కప్ లాంటి టోర్నీ అయితే అభిమానులకు కన్నుల పండుగతో పాటు బీసీసీఐకి కాసుల వర్షం కురిస్తుంది. 2023 లో ఈ రెండు జట్లు కూడా లీగ్ దశలో మరోసారి ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం. దీంతో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన తాజాగా షెడ్యూలు రిలీజ్ చేయగా భారత్-పాక్ మ్యాచ్ అహ్మదాబాద్ లో అక్టోబర్ 15 న జరగనుంది. ఇక అక్టోబర్ 5 న ఈ టోర్నీ ఇంగ్లాండ్ న్యూజీలాండ్ మ్యాచ్ తో స్టార్ట్ అవుతుంది. నవంబర్ 15,16 న రెండు సెమి ఫైనల్స్ ముంబై, కోల్ కత్తా లో నిర్వహించనుండగా.. గ్రాండ్ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరగనుంది. మొత్తానికి అక్టోబర్ 15 న పాకిస్థాన్ తో బ్లాక్ బస్టర్ మ్యాచుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూడడం గ్యారంటీ.
ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.